బిగ్ బాస్: అవినాష్ అత్యాశ కొంపముంచిందిగా.. ఈ సారి ఫిక్స్

-

బిగ్ బాస్ షో పూర్తవడానికి ఇంకా మూడు వారాలే సమయం ఉంది. మొత్తం ఏడు మంది ఉన్న కంటెస్టెంట్లలో ఐదుగురు మాత్రమే ఫినాలే చేరుకుంటారు. ఐతే ఫినాలేకి రేస్ ఈ రోజే మొదలైంది. టికెట్ టు ఫినాలే టాస్కుని బిగ్ బాస్ మొదలెట్టాడు. అందులో భాగంగా మొదటి రౌండ్ లో ఆవు నుండి పాలు పట్టమని చెప్పాడు. ఎవరెక్కువ బాటిల్స్ పాలు పడతారో వారు తర్వాతి రౌండ్ కి క్వాలిఫై అవుతారని తెలిపాడు.

అయితే ఈ టాస్కులో బాగా శ్రమించాలి అన్న బిగ్ బాస్ మాటలని బాగా సీరియస్ గా తీసుకున్న అవినాష్, ఎలాగైనా గెలవాలనే ప్రయత్నంలో అందరితో గొడవ పెట్టుకున్నాడు. మోనాల్, సోహైల్, అఖిల్ ఇలా అందరూ అవినాష్ కి వ్యతిరేకంగా మాట్లాడారు. అదీగాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా పాలల్లో నీళ్ళు కలిపి దొరికిపోయి టాస్క్ నుండి నిష్క్రమించాడు.

గత వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండడం వల్లే సేవ్ అయ్యాయని అనుకున్న అవినాష్, ఈ సారి ఎలాగైనా ఫైనల్ టికెట్ అందుకుని డైరెక్ట్ గా వెళ్ళిపోవాలని బాగా కష్టపడ్డాడు. కానీ ఆ కష్టమంతా బెడిసి కొట్టింది. అవినాష్ చేసిన పనికి ప్రేక్షకుల్లో తీవ్రమైన నెగెటివిటీ పెరిగిపోయింది. అసలే గత వారం ఎలిమినేట్ కావాల్సిన అవినాష్, ఈ సారి కోరి మరీ ఎలిమినేట్ అయ్యేలా ఉన్నట్టు తెలుస్తుంది.

మరి నిజంగానే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతాడా, లేదా ఏదైనా మ్యాజిక్ జరిగి మళ్ళీ సేవ్ అవుతాడా అన్నది చూడాలి. అదీ గాక ఫినాలేకి వెళ్ళే మొదటి కంటెస్టెంట్ ఎవరు అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news