బిగ్ బాస్: ఆటలో దొంగాట.. అమ్మ రాజశేఖర్ కి కోపం తెప్పించిన ఆ ఇద్దరు.

-

బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో గంగవ్వ తప్ప మిగతా కంటెస్టెంట్లు అందరూ చాలా ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పై నుండి పడిన కాయిన్స్ ని దాచుకునే పనిలో ప్రతీ ఒక్కరూ చాలా ఉత్సాహవంతంగా ఆడారు. ఐతే దొరికిన దాచుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని మరొకరికి దొరకనీయకుండా చూసుకోవడం మరో పని. ఐతే ఇతరుల నుండి దొంగతనం చేసే పనిలో మెహబూబ్, సోహైల్ ఒక టీమ్ గా మారి ఇతర కంటెస్టెంట్ల నుండి కాయిన్స్ దొంగతనం చేసారు.

దాంతో అమ్మ రాజశేఖర్ సోహైల్ పై విరుచుకుపడ్డాడు. కప్ నువ్వే తీసుకెళ్ళు, గెలుపు నీదే అంటూ కామెంట్లు చేసాడు. అటు పక్క మెహబూబ్, అభిజిత్ ల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదంలో మెహబూబ్ అతిగా మాట్లాడాడు. ఫిజికల్ అయ్యిందంటే నాకు తెలియదు మరి అంటూ గతంలో మాదిరిగానే సినిమా డైలాగులు చెప్పాడు. మొత్తానికి సోహైల్, మెహబూబ్.. ఇద్దరూ హౌస్ మేట్స్ కి టార్గెట్ గా మారారు.

కాయిన్స్ విలువని సగం చేసే టాస్కులో సైతం అమ్మ రాజశేఖర్, సోహైల్ మధ్య గొడవ జరిగింది. కొంచెం మితిమీరినా కొట్టుకుంటారేమో అన్నంతగా మాట్లాడుకుంటున్నారు. ఆట మధ్యలో అవినాష్ కాలు బెణకడం, మోనాల్ ఏడుపులు అన్నీ కలిపి బిగ్ బాస్ ని ఆసక్తిగా మార్చేసాయి. మరి ఈ కాయిన్స్ టాస్కులో ఎవరు నెగ్గుతారో, ప్రేక్షకులని ఎవరు మెప్పిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news