బిగ్ బాస్ ఎపిసోడ్ 1: మొదటిరోజే మత్తెక్కించే ఎపిసోడ్.. వినోదానికి ఆల్ సెట్!

-

తెలుగు బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 మొదలైపోయింది. బుల్లితెర ప్రేక్షకులకు ఈ సారి మరింత వినోదాన్ని పంచే విధంగా బిగ్ బాస్ షో ను నిర్వాహకులు రూపొందించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా నాలుగో సీజన్ కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను పంచడానికి వచ్చేసింది.

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో హంగామా షురూ అయిపోయింది. నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో ఎప్పటిలాగే నాగార్జున ఎంట్రీ తర్వాత ఒక్కొక్కరుగా కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతారు అని అంత అనుకున్నారు. అయితే తండ్రి పాత్రలో అతిథిగా ముసలి నాగార్జున వచ్చి హౌస్ అంతా కలియతిరిగారు. తన స్టైల్లో ఛలోక్తులు, చమత్కారాలు విసిరారు.

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మొదటిగా మోనాల్ గజ్జర్ (సుడిగాడు హీరోయిన్) హౌస్ లోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత సూర్యకిరణ్ (దర్శకుడు, నటి కళ్యాణి భర్త), యాంకర్ లాస్య, అభిజిత్ (‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో), జోర్దార్ సుజాత (యాంకర్) మెహబూబ్ దిల్ సే (సోషల్ మీడియా స్టార్), దేవి (న్యూస్ ప్రెజెంటర్), దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్), సయ్యద్ సోహైల్ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్) అరియానా గ్లోరీ (యాంకర్), అమ్మా రాజశేఖర్ (కొరియోగ్రాఫర్), కరాటే కల్యాణి (నటి), నోయల్ (నటుడు, రాప్ సింగర్), దివి (వెబ్ సిరీస్ నటి), అఖిల్ సార్దక్ (టీవీ నటుడు), గంగవ్వ (సోషల్ మీడియా సెన్సేషన్) వరుస క్రమంలో లోపలికి వచ్చారు.

ప్రతి ఒక్కరూ నాగార్జునతో స్టేజీపైన తమ కథను పంచుకొని ఈ అవకాశం రావడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నది ప్రేక్షకులకు వినిపించి…. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. అయితే వీరందరిలో సయ్యద్, అరియానా గ్లోరీ లు మాత్రం హౌస్ లోకి ప్రవేశించకుండా సీక్రెట్ రూమ్ లోనే ఉన్నారు. అంటే హౌస్ లోని 14 మందికి బయట మరో ఇద్దరు ఉన్నట్లు తెలియనట్లే. ఇక వీరిలో షో ముగిసే సమయానికి ఎవరు హీరోలు అవుతారు.. ఎవరు జీరో అవుతారో తెలుసుకోవాలంటే రోజూ క్రమం తప్పకుండా ‘స్టార్ మా’ ఫాలో కావాల్సిందే. శని, ఆదివారాలలో రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. ఇక మిగిలిన రోజుల్లో మాత్రం రాత్రి 9 : 30 గంటలకు ఈ షో మొదలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news