బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్ రిలీజ్ అయ్యిందిగా.. రష్మీ అదరగొట్టేసింది.

-

నందు హీరోగా ఇప్పటి వరకూ చాలా సినిమాలు చేసాడు. ఈ ఏడాది రిలీజైన సవారి చిత్రం ప్రేక్షకులని సరిగ్గా ఆకట్టుకోలేకపోయింది. ఐతే తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నందు విజయ్ క్రిష్ణ పేరుతో పరిచయం అవుతూ, పోతురాజు పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్ ఈరోజే రిలీజైంది. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది.

గతంలో నందు చేసిన సినిమాలన్నింటిలోకీ డిఫరెంట్ గా ఉండి ఆసక్తి రేకెత్తిస్తుంది. పూరీ అభిమాని అయిన పోతురాజు పాత్ర ఏం చేయాలనుకుంటున్నాడనేది స్పష్టంగా చూపించారు. యాంకర్ రష్మీకి హీరోయిన్ గా గుర్తుండిపోయే చిత్రం అయ్యేలా ఉంది. గతంలో మాదిరి గ్లామర్ ఒలకబోసే పాత్రలు కాకుండా ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. మరి ఈ సినిమాతోనైనా అటు హీరోకి, హీరోయిన్ కి బ్లాక్ బస్టర్ పడుతుందేమో చూడాలి.

రాజ్ విరాట్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతుంది. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version