రియా తల్లి తండ్రులను పిలిచిన సిబిఐ…!

-

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం కేసులో అతని ప్రేయసి రియా చక్రవర్తిని విచారించిన సిబిఐ అధికారులు ఇప్పుడు ఆమె కుటుంబాన్ని కూడా విచారించే అవకాశం ఉంది. రియా చక్రవర్తి తల్లిదండ్రులను విచారించడానికి గానూ… డిఆర్డిఓ గెస్ట్ హౌస్ కు పిలిచారు. రియా చక్రవర్తి తల్లిదండ్రులు, ఇంద్రజిత్ చక్రవర్తి మరియు సంధ్య చక్రవర్తి నేడు విచారణకు వెళ్తున్నారు.

Riya
Riya

సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్‌ తో సన్నిహితంగా ఉన్నందున వీరిని సిబిఐ పిలిపించింది. జనవరి 2020 లో సుశాంత్ తన సలహాదారులు మరియు సిఐలతో జరిగిన సమావేశంలో రియా తండ్రి హాజరయ్యారు. సమావేశం యొక్క ఆడియో రికార్డింగ్‌ కూడా బయటపెట్టారు. రియా చక్రవర్తిని ఈ రోజు ప్రశ్నించడానికి సిబిఐ పిలవలేదు. మూడు రోజుల పాటు సిబిఐ అధికారులు ఆమెను విచారణకు పిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news