కేరళ వరద బాధితులకు మెగా సాయం..!

-

కేరళలో భారీ వర్షాల కారణంగా అక్కడ జనాలు నానా ఇక్కట్లు పడుతున్నారు. వరద నీరు అక్కడ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఇప్పటికే వందల కొద్ది ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. కేరళ వరద బాధుతులను సాయం చేసేందుకు ఇప్పటికే రెస్క్యూ టీంలు తమ పని మొదలు పెట్టగా సిని ప్రముఖుల నుండి బాధితుల సహాయార్ధం విరాళాలు అందిస్తున్నారు.

ఇప్పటికే మెగా పవర్ స్టార్ తానో పాతిక లక్షలు సాయం ప్రకటించగా.. ఉపాసన మరో 10 లక్షలు విరాళం ప్రకటించింది. ఇక చిరు తల్లి కూడా పాతిక లక్షలు కేరళ బాధితులకు అందిస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి కూడా మరో పాతిక లక్షలు ఇస్తున్నారట. వీరంగా సిఎం రిలీఫ్ ఫండ్ కు ఈ విరాళాలు అందిస్తున్నారట. కేరళ ప్రకృతి వైపరీత్యానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడి వారు అక్కడే ఆగిపోవడం వల్ల బాధితులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news