చిరంజీవి కనుసన్నల్లో చిత్రలహరి..!

-

మెగా మెనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ గాడిన పెట్టాలన్న బాధ్యత మీద వేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వరుస ఫ్లాపులతో మెగా హీరో సాయి ధరం తేజ్ కెరియర్ రిస్క్ లో పడింది. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు తేజూ. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక సినిమా కథ విషయానికొస్తే హీరోయిన్స్ ఇద్దరి చేతుల్లో రెండు సార్లు లవ్ ఫెయిల్ అయ్యే కుర్రాడి కథే చిత్రలహరి అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించి ప్రతిది చిరు కనుసన్నల్లో జరుగుతుందట. ఫుల్ స్క్రిప్ట్ చిరు ఆమోదం పొందాకే సెట్స్ మీద వెళ్లగా రష్ చూశాక చిరు శాటిస్ఫై అయినట్టు తెలుస్తుంది. ఇక క్లైమాక్స్ విషయంలో దర్శకుడు కిశోర్ తిరుమల నెగటివ్ ఎండ్ రాసుకోగా చిరు సలహా మేరకు పాజిటివ్ గా మార్చారట. సో మొత్తానికి మేనళ్లుడికి హిట్ ఇచ్చే బాధ్యత మీద వేసుకున్న చిరంజీవి అల్లుడికి మంచి సపోర్ట్ గా ఉన్నాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news