సీనియ‌ర్ హీరోయిన్ల‌తోనే చేస్తున్న చిరు.. మ‌రోసారి అదే బాట‌లో

-

మెగాస్టార్ చిరంజీవి రెండో ఇన్నింగ్స్‌లో వ‌రుస‌గా సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నారు. ప్ర‌తి సినిమాను హిట్ చేసేలా ప‌క్కాగా ప్లాన్‌చేసుకుంటూ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ల‌నే లైన్ లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఆచార్య సినిమాను చేస్తున్నాడు. ఇదిలా ఉండ‌గానే మ‌రో హిట్ సినిమా రీమేక్ చేయ‌బోతున్నాడు.

మ‌ళ‌యాలంలో హిట్ అయిన లూసీఫ‌ర్‌ను చ‌ర‌ణ్ తెలుగు హ‌క్కులు సొంతం చేసుకున్నాడు. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న ఎవ‌రైతే బాగుంటుందా అని త‌ర్జ‌న‌, భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అయితే మ‌రోసారి సీనియ‌ర్ హీరోయిన్ల‌నే తీసుకుంటార‌ని తెలుస్తోంది.

సైరా, ఖైదీ నెంబ‌ర్ 150, ఆచార్య సినిమాల్లో సీనియ‌ర్ హీరోయిన్ల‌నే తీసుకున్నారు. ఇప్పుడు లూసీఫ‌ర్‌లో కూడా సీనియ‌ర్, స్టార్ హీరోయిన్ల‌యిన అనుష్క‌, న‌య‌న‌తార‌ల‌ను సంప్ర‌దిస్తున్నారు. ఇందులో అనుష్క అయితేనే బాగుంటుంద‌ని టీమ్ భావిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే నైన‌తార‌తో చిరు చేశారు కాబ‌ట్టి అనుష్క‌ను తీసుకోవాల‌ని చూస్తున్నారంట‌.

Read more RELATED
Recommended to you

Latest news