కోలీవుడ్ స్టార్ హీరోల మద్య కోల్డ్ వార్ …!

-

తమిళ చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ఓ వివాదం సంచలనం అవుతుంది. హీరో సూర్య నిర్మాతగా 2 డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కించిన “ఫోన్మగళ్ వందాల్” సినిమాని థియేటర్స్ లో కాకుండా ఓ టి టి లో విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు. లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ బంధ్ ఉన్న నేపథ్యంలో సూర్య ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాని సూర్య నిర్ణయాన్ని థియేటర్స్ అసోసియేషన్స్ వ్యతిరేకించాయి. సూర్య సినిమాల తో పాటు తన తమ్ముడు కార్తి సినిమాలను నిషేధిస్తామని వెల్లడించారు.

 

అయినా సూర్య ఇవేమీ పట్టించుకోలేదు. ఓ టి టి లో తన సినిమాలని రిలీజ్ చేయడానికే మొగ్గు చూపిస్తున్నాడు. అయితే దీనికి వ్యతిరేకంగా కోలీవుడ్ స్టార్స్ కూడా విజయ్ ధనుష్ ఉండటం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్, ధనుష్ జగమే తందిరం సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు మాత్రం సూర్య మాదిరిగా ఓ టి టి లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్దంగా లేరట. లేటయిన తమ సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేస్తామన్న పట్టుదలతోనే ఉన్నారట.

అయితే ఇక్కడే సూర్య కి విజయ్, ధనుష్ లకి మద్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు తాజా సమాచారం. కోట్లలో ఖర్చు పెట్టి సినిమాలని నిర్మించి రిలీజ్ చేయకుండా ఎలా ఉండాలి. పరిస్థితులను బట్టి ప్రత్యామ్నయాలు చూసుకోవాలన్న ధోరణలో సూర్య ..అదే కోట్లు ఖర్చు చేసి నిర్మించిన సినిమాలని ఓ టి టి లో రిలీజ్ చేయడం కంటే వెబ్ సిరీస్ ని నిర్మించుకోవడం మంచిదన్నట్టుగా మిగతా హీరోలు మాట్లాడుతున్నారట. ఇక ఇలాంటి చర్చలు టాలీవుడ్ లోను జరుగుతున్నప్పటికి ఇలా వివాదాలు మాత్రం తలెత్తకపోవడం గొప్ప విషయం.

Read more RELATED
Recommended to you

Latest news