‘మత్తు వదలరా-2’మూవీకి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

-

మెగాస్టార్ చిరంజీవి మత్తు వదలరా-2 మూవీ చిత్ర బృందాన్ని అభినందించారు. ‘నిన్ననే సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో మొదటి నుంచి చివరి వరకు ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనిపించలేదు. ఎండ్ టైటిల్స్‌ను కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు రితేశ్ దే. అతని రాత, తీత, కోత, మోత బాగుంది. ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ వినోదపర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేము. హ్యాట్సాఫ్’ అని ట్వీట్ చేశారు.

ఇదిలాఉందగా, మత్తు వదలరా పార్ట్ వన్‌ను కొనసాగింపుగా పార్ట్-2ను తెరకెక్కించిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. వీకెండ్ కావడంతో సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే చాన్స్ ఉందని మూవీ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా కనిపించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా.. కమెడియన్ సత్య కీలక రోల్ పోషించారు. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version