మల్టీస్టారర్ మూవీ ఆపేస్తున్నారా..!

-

టాలీవుడ్ లో ఊపందుకున్న మల్టీస్టారర్ ట్రెండ్ లో భాగంగా సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆగిపోనుందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఎవరి మల్టీస్టారర్ మూవీ ఆపేస్తున్నారు అంటే విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేద్దామనుకున్న మల్టీస్టారర్ మూవీ ఆగిపోతుందని తెలుస్తుంది. బాబి డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది.

సురేష్ బాబు, కోనా వెంకట్ దీనికి నిర్మాతలుగా వ్యవహరించాల్సి ఉంది. లైన్ ఓకే అనేలా ఉన్నా బాబి రాసుకొచ్చిన ఫైనల్ స్క్రిప్ట్ అంత సాటిస్ఫైడ్ గా లేదట. అందుకే సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కు రెడ్ సిగ్నల్ వేశాడట. జై లవ కుశ తర్వాత ఎన్.టి.ఆర్ ఓ సినిమా తీశాడు రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. కాని దర్శకుడు బాబి మాత్రం సినిమాకే ఓకే చేయించుకోలేకపోతున్నాడు.

దాదాపు వెంకీ, చైతు మల్టీస్టారర్ అటకెక్కినట్టే అని తెలుస్తుంది. మరి బాబి వేరే నిర్మాతతో ఈ సినిమా చేస్తాడా లేక తను కూడా వేరే ప్రాజెక్ట్ పట్టుకుంటాడా అన్నది త్వరలో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news