ఎన్సీబీ ముందుకు నేడు రకుల్, రేపు దీపిక..

-

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి లింక్ ఉన్న అక్రమ మాదక ద్రవ్యాల సరఫరా కేసులో నటి రియా చక్రవర్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెప్టెంబరు 23వ తేదీన మరో నలుగురు బాలీవుడ్ హీరోయిన్లకి ఎన్సీబీ నుండి సమన్లు జారీ అయ్యాయి. దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా ఆలీఖాన్, శ్రద్ధ కపూర్ లకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ఈ నలుగురు ఎన్సీబీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

అయితే నేడు రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ ముందుకు వెళ్ళనుందట. సమన్లు జారీ అయినపుడు హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న రకుల్, వెంటనే ముంబై వెళ్ళిపోయింది. ఈ రోజు రకుల్ ని ప్రశ్నించాక రేపు దీపికా పదుకునే ఎన్సీబీ ముందు హాజరు అవుతుందట. షూటింగ్ నిమిత్తమై గోవాలో ఉన్న దీపికా పదుకునే ముంబై వచ్చేసిందట. మాదక ద్రవ్యాల కేసులో దీపికా పేరు రాగానే అందరూ షాకయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news