నైటీతో మాయింటికి వచ్చింది.. కడుపు కోత మిగిలింది : హేమంత్ తల్లి !

-

హేమంత్‌ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన తల్లి కోరారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్న కొడుకును దారుణంగా హత్య చేశారని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. డబ్బు అహంకారం, కులపిచ్చితోటే తన కొడుకుని హత్యచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తానంటే కొడుకుకు ప్రాణమన్న ఆమె ఉదయం లేచినప్పటి నుండి తనతో మాట్లాడకుండా ఉండలేడని అన్నారు. నిన్న కూడా నాతో మాట్లాడాడన్న ఆమె మారుతీ రావు లాంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా సమాజంలో మార్పు రాలేదని అన్నారు.

హేమంత్‌ ను చంపుతారని అనుకోలేదని, ధన అహంకారము, కులం పిచ్చి తోటే నా కొడుకును హత్య చేశారని అన్నారు. వాళ్లు రెడ్డిలు మేము వైశ్యులమని చెప్పి నా కొడుకు ని హత్య చేశారని ఆమె అన్నారు. అవంతిక ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా వాళ్లకు ఇచ్చేసామని, అవంతిక కేవలం నైటీతో మాత్రమే మా ఇంటికి వచ్చిందని ఆమె అన్నారు. కన్న కూతురిలా అవంతికను చూసుకుంటున్నానన్న ఆమె మరో కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన శిక్ష పడాలని అన్నారు. అవంతిక తండ్రి ఎంత కఠినాత్ముడైనా ఆమె తల్లికి ఆ బాధ తెలియదా ? అని ఆమె ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news