పరువు లేని నాగార్జున పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదం – సీపీఐ నారాయణ

-

అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సమంత పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ గా చేసుకొని మీడియా ముందు వెల్లడించిన విషయాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి.

కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం కూడా తెలిసిందే. తన ప్రతిష్టకు, తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని కొండా సురేఖ పై నాగార్జున 100 కోట్లకు పైగా పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ నాంపల్లి క్రిమినల్ కోర్టులోని మనోరంజన్ కోర్టులో విచారణకు కూడా వచ్చింది. అయితే కొండా సురేఖ పై అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా పై శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

పరువు లేని నాగార్జున పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షో ద్వారా పరువు పోగొట్టుకున్న నాగార్జున.. కొండా సురేఖ పై దావా వేయడం ఏమిటని ఆక్షేపించారు. సమంత లాంటి వాళ్ళు కేసు వేసినా ఓ అర్థం ఉంటుందని అన్నారు నారాయణ. కొండా సురేఖ క్షమాపణలు తెలిపిన తరువాత కూడా కోర్టుకు వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news