Sanjay Gadhvi : ధూమ్ దర్శకుడు కన్నుమూత

-

బాలీవుడ్ సినీ పరిశ్రమంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ గాద్వి (56) కన్నుమూశారు. ముంబైలోని నివాసంలో ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారని పెద్ద కుమార్తె సంజీవ వెల్లడించారు. ఆయన మరణంతో బాలీవుడ్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ ప్రముఖులు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.


2000లో విడుదలైన తేరే లియో తో సంజయ్ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. 2004లో విడుదలైన ధూమ్ మూవీతో ఆయన తొలి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత అదే అది ధూమ్ టు తో కూడా అలరించారు. 2020లో విడుదలైన ఆపరేషన్ పరిందే తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టలేదు. ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు. సంజయ్ మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు వేదికగా తమ ప్రగాఢ సంతాపం తెలిపారు కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. సంజయ్ కి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఆయన ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి మల్టీప్లెక్స్ లో సినిమాలు కూడా చూశారని చెబుతున్నారు. సంజయ్ మీరే యార్ కి షాద్ హై కిడ్నాప్ వంటి సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news