Krish Jagarlamudi: ఆ స్టార్ హీరోతో క్రిష్ మ‌రో ప్ర‌యోగం.. “అత‌డు అడవిని జ‌యించాడు” సినిమా !

-

Krish Jagarlamudi: టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. వైవిధ్యమైన కథతో ఆయ‌న తెర‌కెక్కించిన తొలి చిత్రం గ‌మ్యం. వాస్తవ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించి.. భావోద్వేగాలను అద్భుతంగా పండించాడు. ఇలా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న దర్శకుడు క్రిష్ . ఇలా ‘వేదం’, ‘కృష్ణంవందే జగద్గురం’, ‘కంచె’ అలాంటి సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు.

గుండెల‌ను మెలిపెట్టే భావోద్వేగాలు, నిత్య జీవితంలోని క‌ధ‌ల‌ను మనసుకు హత్తుకునే తెర‌కెక్కించ‌డంలో ఆయ‌న దిట్ట‌. సామాన్య ప్రేక్షకుడి నాడిని తెలుసుకున్న వైవిధ్య దర్శకుడు క్రిష్‌. అలాగే. చ‌రిత్రాక నేప‌ధ్యంతో ‘గౌతమపుత్ర శాతకర్ణ’ అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన‌, నంద‌మూరి తార‌క రామ‌రావు జీవిత ఆధారంగా ‘ఎన్టీఆర్‌’ బయోపిక్ అనే చిత్రాన్ని తీసిన అవన్నీ భిన్నమైనవే.

ఇప్పుడు .. మెగా హీరో వైష్ణ‌వ్ తేజ హీరోగా .. కొండ‌పొలం అనే న‌వ‌ల ఆధారంగా ‘కొండపొలం’ అనే మ‌రోసారి విభిన్న కథాంశాన్ని తెలుగు ప్రేక్షకులను ప‌రిచ‌యం చేశాడు. ప్ర‌స్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు అనే మ‌రో చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ని బందిపోటుగా చూపించబోతున్నాడు. ఔరంగజేబు కాలం నాటి పరిస్థితులతో క్రిష్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

ఇదిలాఉంటే.. ఈ సినిమా త‌రువాత ఏ హీరోతో సినిమా తీయ‌బోతున్నాడు. త‌దుప‌రి క‌థాంశమేమిటనే ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. హరి హర వీరమల్లు చిత్రం త‌రువాత‌.. డాక్టర్ కేశవ రెడ్డి రచించిన ‘ అతడు అడవిని జయించాడు’ అనే నవల ఆధారంగా తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు క్రిష్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్. విక్టరీ వెంకటేష్ హీరోగా స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్ 3 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news