BREAKING : దర్శకుడు ఎన్. శంకర్ కు భూ కేటాయింపుపై హైకోర్టు తీర్పు

-

BREAKING : టాలీవుడ్‌ దర్శకుడు ఎన్. శంకర్ కు భూ కేటాయింపుపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దర్శకుడు ఎన్. శంకర్ కు భూ కేటాయింపులో జోక్యం చేసుకోలేమని హై కోర్టు తేల్చి చెప్పింది. ఇవాళ టాలీవుడ్‌ దర్శకుడు ఎన్. శంకర్ కు భూ కేటాయింపుపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా దర్శకుడు ఎన్.శంకర్ కు భూమి కేటాయింపు ప్రక్రియను సమర్థించింది హై కోర్టు. శంకర్ కు భూ కేటాయింపు పై దాఖలైన పిల్ కొట్టివేసింది హై కోర్టు. స్టూడియో నిర్మాణం కోసం 2019లో శంకర్ కు భూమి కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిళ్ల వద్ద 5 ఎకరాలు కేటాయించింది కేసీఆర్‌ ప్రభుత్వం. అయితే.. ఈ భూమిపై కొంత మంది వ్యక్తులు.. శంకర్‌ కు వ్యతిరేకంగా పిటీషన్లు వేయగా.. ఇవాళ హైకోర్టు.. వాటిని కొట్టివేసింది. దీంతో టాలీవుడ్‌ దర్శకుడు ఎన్. శంకర్ కు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version