పూరి విశ్వ‌రూపం..దిగొస్తున్న స్టార్లు

-

ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ తో పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. పూరి విశ్వ‌రూపం ఏంటో మ‌రోసారి చూపించాడు. నాలుగు రోజుల్లోనే 50 కోట్ల క్ల‌బ్ లో చేరిన చిత్రం. స్టిల్ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. మాస్ జ‌నాల్లో డబుల్ కిక్ ను ఇచ్చింది. దీంతో చూసిన వారే రెండ‌వ‌సారి థియేట‌ర్ వైపు ప‌రుగులు పెడుతున్నారు. రివ్యూలు పూరి స్పీడ్ ను ఏ మాత్రం ఆప‌లేక‌పోయాయి. రొటీన్ సినిమా….చెత్త సినిమా అని రివ్యూలు ఇచ్చిన వారంద‌రికీ హిట్టే చెంప‌దెబ్బ‌లాంటి స‌మాధానం. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత వ‌చ్చిన స‌క్సెస్ ఇది. దీంతో పూరి రెట్టించిన ఉత్సాహంలో ఉన్నాడు. తాజాగా పూరి స‌క్సెస్ ను చూసిన టాలీవుడ్ టాప్ స్టార్లు అంతా దిగొస్తున్న‌ట్లు స‌మాచారం.

Energetic performances by all

కాసేప‌టి క్రిత‌మే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పూరిని ఉద్దేశించి ఫేస్ బుల్ ఓ పోస్ట్ పెట్టాడు. అందులో పూరిని ఓ రేంజ్ లో ఆకాశానికి ఎత్తేసాడు. రామ్ , ఇత‌ర న‌టీన‌టులు చాలా ఎన‌ర్జిటిక్ గా న‌టించారు. పూరి జ‌గ‌న్నాథ్ శుభాకాంక్ష‌లు అన్నింటిని ఒక్క చో్టుకు చేర్చి, ఓ మంచి సినిమా తీసిన వ్యక్తి ఆయ‌న అని అన్నారు. దీంతో పాటు పూరి, రామ్ ఫోటోల‌ను షేర్ చేసాడు. దీనికి రామ్ ధ‌న్య‌వాదాలు సోద‌రా అని స్పందించాడు. ఇక ఎన్టీఆర్ ఇప్ప‌టికే పూరికి వ్య‌క్తిగ‌తంగా పోన్ చేసి శుభాంకాక్ష‌లు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇద్ద‌రు క‌లిసి టెంప‌ర్ సినిమా దగ్గ‌ర నుంచి మంచి స్నేహితులైన సంగ‌తి తెలిసిందే. ఆ రిలేష‌న్ కార‌ణంగానే తార‌క్ ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ అయిన రెండ‌వ రోజు చూసాడుట‌.

ఆ వెంట‌నే ఫోన్ చేసి విష్ చేసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా వెలుగులోకి వ‌చ్చింది. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా పూరితో ఫోన్లో మాట్లాడ‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. పూరి మాస్ కంటెంట్ ను మ‌హేష్ పిచ్చిగా ఇష్ట‌ప‌డిన‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌లే పూరి-మ‌హేష్ ల మ‌ధ్య చిన్న‌పాటి మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. ఆడియో వేడుక‌ల‌పై మహేష్ హిట్లు ఇచ్చిన ద‌ర్శ‌కులంద‌రికీ గురించి మాట్లాడి పూరిని మ‌ర్చిపోయాడు. అటుపై పూరికి అవ‌కాశం ఇవ్వ‌ని స్టార్ అంటూ ట్రోలింగ్ ల‌కు గుర‌య్యాడు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల పూరి చేసిన కొన్ని కామెంట్స్ వివాద‌స్ప‌దంగా మారాయి. వాటిన్నింటికి మ‌హేష్ ఫోన్ కాల్ ప‌రిష్కారం చూపించింద‌ని తాజా స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news