అందరికీ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నావ్ నాన్నా .. నాకెప్పుడు హిట్టిస్తావ్ ..!

-

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ఇండస్ట్రీలో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరికి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రాం చరణ్, రవితేజ …ఇలా చాలా మంది హీరోల లిస్ట్ ఉన్న సూపర్ హిట్ మూవీస్ లో ఒక బ్లాక్ బస్టర్స్ పూరి జగన్నాధ్ ది కావడం విశేషం. అయితే ఒక స్టార్ డైరెక్టర్ అయుండి ఇప్పటి వరకు తన తనయుడు పూరీ ఆకాష్ కి మాత్రం హిట్ ఇవ్వలేకపోయారు పూరి జగన్నాధ్. ఆకాష్ చిన్నప్పుడు ప్రతీ రోజు నిద్ర లేవగానే తండ్రి ముందు ప్రత్యక్ష్యమై చిరంజీవి, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోల సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి ఒక్క ఛాన్స్ ఇవ్వు నాన్నా అని అడిగేవాడు. అలా అడగడంతో చైల్డ్ ఆర్టిస్ట్ ని చేశారు పూరి.

 

చిరుత, బుజ్జిగాడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్ ‘మెహబూబా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఒకేసారి తండ్రీ కొడుకులిద్దరికి పెద్ద షాకిచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ‘ఇస్మార్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని కంబ్యాక్ అయ్యారు. దాంతో ఈసారి ఖచ్చితంగా కొడుకుకి మంచి హిట్ ఇవ్వాలన్న తాపత్రయంలో ఉన్నారు. దానికి తోడు ఆకాష్ కూడా తండ్రిని … అందరికీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు నాకో హిట్ ఇవ్వరా అంటూ అడిగాడట.

అందుకే ఈసారి మంచి ‘రొమాంటిక్’ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు పూరి. అయితే ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించడం లేదు. కథ – స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తూ కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి దర్శకత్వ భాధ్యతలు అప్పగించాడు. ‘రొమాంటిక్’ టైటిల్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పోస్టర్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక సాంగ్ ప్రోమో కూడా పూరి మార్క్ తో యూత్ కి హీటెక్కేలా ఉంది. ఇక ఆకాశ్ కు జంటగా నటిస్తున్న కేతికా శర్మ కూడా అందాల ఆరబోతతో కుర్రకారుని అట్రాక్ చేసింది. ఇక సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ – పూరి కనెక్ట్స్ బ్యానర్స్ లో పూరి జగన్నాథ్ – ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news