ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్కు ఊపిరిపోసిన సినిమాల్లో గదర్-2 ది ప్రత్యేక స్థానం. సన్నీ డియోల్ కథానాయకుడిగా అనిల్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను రఫ్ఫాడిస్తోంది. రూ.60 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.450 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
గదర్2 ఓటీటీ రిలీజ్ డేట్ పై దర్శకుడు అనిల్ శర్మ స్పందించాడు. ప్రస్తుతం ప్రేక్షకులు ‘గదర్2’ థియేటర్లో చూసేందుకే ఆసక్తి చూపిస్తుండటంతో… ఈ ఒరవడి ఇంకొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పారు. తనకు తెలిసినంత వరకూ మరో ఆరు నెలల తర్వాతే సినిమా ఓటీటీలోకి వస్తుందని అన్నారు. అప్పటివరకూ సినిమాను థియేటర్లోనే చూస్తారని అనుకుంటున్నానని.. ప్రేక్షకులు చూపిస్తున్న ఉత్సాహమే తమ సినిమాకు అతిపెద్ద విజయమని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు ‘గదర్2’ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో నటుడు సన్నీ డియోల్ తన రెమ్యునరేషన్ ఏకంగా రూ.50కోట్లు చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను భవిష్యత్లో చేయబోయే ప్రాజెక్ట్లకు సంబంధించిన పారితోషికం వివరాలు ఆ సినిమాకు సంతకం చేసినప్పుడే తెలుస్తాయని అన్నారు