వరంగల్‌ లో నయీమ్ బ్రిడ్జి పంచాయితీ..కేటీఆర్‌పై నాయిని సంచలనం !

-

హనుమకొండలో నయీమ్ బ్రిడ్జి పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ BRS క్రెడిట్ ఫైట్ జరుగుతోంది. కేటీఆర్ వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సవాల్ విసిరారు వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి. ఈ రోజు ఉదయం అదే నయీమ్ నగర్ బ్రిడ్జి మీదకు బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆ బ్రిడ్జి పైనే కుర్చీ వేసుకొని కూర్చుంటా KTR రావాలని సవాల్ విసిరారు.

Naini Rajender Reddy warns KTR

వాడు వీడని సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన KTR క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి. కేటీఆర్ హనుమకొండకు వచ్చి క్షమాపణ చెప్పక పోతే వదిలే ప్రసక్తి లేదంటున్నారు నాయిని రాజేందర్ రెడ్డి. దీంతో హనుమకొండ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగానే నయీంనగర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న MLA నాయిని రాజేందర్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. నాయీమ్ నగర్ బ్రిడ్జి తను నిర్మించానంటూ కేటీఆర్‌ అంటున్నాడు.. ఒకవేళ నువ్వు నిర్మించిదే ఉంటే నేనే నీకు పూలమాలతో సత్కరిస్తా, లేకపోతే నీకు ఏ దండలు వేయాలో తెలపాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version