బేబీ బంప్ తో దర్శనమిచ్చిన జెనీలియా.. ఫొటోస్ వైరల్..!

-

బొమ్మరిల్లు సినిమాతో హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ తరువాత స్టార్ హీరోలతో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయింది. ఇక ఆ తర్వాత ఇద్దరు కొడుకులు జన్మించగా.. అటు పిల్లలు, ఇటు కుటుంబ బాధ్యతలను తీసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం జెనీలియా ఇద్దరు కొడుకులు కూడా స్కూలుకు వెళ్తున్నారు.

ఇక అందుకే ప్రస్తుతం మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ . తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన మజిలీ సినిమాను వేద్ అనే పేరుతో జెనీలియా, రితేష్ చేసి మంచి విజయం అందుకున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాతలు కూడా వీరే కావడం విశేషం. సినిమా విజయవంతం అవడంతో జెనీలియాకి కూడా మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా బేబీ బంప్ తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.

గత రాత్రి ముంబైలో జెనీలియా, రితేష్ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో సందడి చేయగా.. ఆ ఈవెంట్ కి జెనీలియా వైలెట్ కలర్ మినీ ఫ్రాక్ లో దర్శనమిచ్చింది. అంతే కాదు ఆ గౌన్లో ఆమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించడం మనం చూడవచ్చు. దీంతో ఆమెను చూసిన అభిమానులంతా ముచ్చటగా మూడోసారి జెనీలియా ప్రెగ్నెంట్ అయింది అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొంతమంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే ఈ బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తోంది. మరి ఇది నిజమో కాదో అన్నది ఇంకా జెనీలియా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news