మోదీ జీ.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది : షారుక్ ఖాన్

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. దిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసినందుకు షారుక్ మోదీని ప్రశంసించారు. ప్రపంచదేశాల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు మోదీ కృషి చేస్తున్నారని కొనియాడుతూ షారుక్ ట్వీట్ చేశారు. ఇంకా ట్వీట్​లో షారుక్ ఏమన్నారంటే..?

మోదీ ట్వీట్‌ చేసిన ఓ వీడియోను షారుక్‌ రీ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్​కు క్యాప్షన్ జోడిస్తూ..‘’‘జీ20 సదస్సుకు నాయకత్వం వహించినందకు మోదీకి అభినందనలు. ఈ సదస్సు వల్ల వివిధ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. వాటి భవిష్యత్తు బాగుంటుంది. ఇక మోదీని చూసి ప్రస్తుతం భారతీయులందరూ గర్వపడుతున్నారు. మీ నాయకత్వంలో ఒంటరిగా కాకుండా ఐకమత్యంతో అభివృద్ధి చెందుతాం’’’ అని రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా ‘వన్‌ ఎర్త్‌, వన్ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌’ అనే నినాదాన్ని కూడా షారుక్‌ ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మోదీని కొనియాడుతూ నెటిజన్లు కూడా పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట మోదీ హవా.. జీ20 విజయోత్సవం ట్రెండ్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news