సంచలన నిర్ణయం తీసుకున్న గెటప్ శ్రీను.. వాటికి దూరమంటూ..!

-

జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న వారిలో గెటప్ శ్రీను ఒకరు. ఆయన జబర్దస్త్ షోలో ఎన్నో స్కిట్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్ని క్యారెక్టర్స్లో తన నటనను చూపించి గెటప్ శ్రీనుగా మారిపోయాడు. అలాగే పలు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించాడు. అయితే ప్రస్తుతం శ్రీను ‘రాజు యాదవ్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రం మే 17న విడుదల కాబోతుంది. ఇప్పటికే రాజు యాదవ్ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని జనాల్లో మంచి ఆదరణ పొందాయి.

 

అయితే ప్రమోషన్స్ కి ఇంకా రెండు రోజులే ఉండటంతో అందరి దృష్టి ఈ మూవీపైనే పడింది. ఈ క్రమంలో.. తాజాగా, గెటప్ శ్రీను ఓ సంచలన నిర్ణయం తీసుకుని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ” కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. మళ్లీ కలుద్దాం” అని రాసుకొచ్చాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావ్ అని ప్రశ్నల వర్షం కురిపించడంతో కాసేపటికి పోస్ట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version