షాకింగ్ : హీరో ధ‌నుష్, ఐశ్వ‌ర్య జంట డైవ‌ర్స్

-

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌, సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ కూతురు నిర్మాత ఐశ్వ‌ర్య జంట విడిపోతున్నారు. ఈ విష‌యాన్ని ఇద్ద‌రూ త‌మ సోష‌ల్ మీడియా ఖాతా ల ద్వారా సోమ వారం రాత్రి అధికారికంగా ప్ర‌కటించారు. త‌మ సోష‌ల్ మీడియాలో ఒక లేఖ ను పోస్టు చేసి.. తాము విడిపోతున్నామ‌ని ధృవీక‌రించారు. ఆ లేఖ‌లో.. “గ‌త 18 ఏళ్ల నుంచి స్నేహితులుగా, భార్య భ‌ర్త‌లుగా, త‌ల్లి దండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని ప్ర‌యాణం కొన‌సాగించం.

కానీ ఇప్పుడు ఇద్ద‌రం వేరు వేరు దారుల్లో ప్ర‌యాణించేందుకు రెడీ అయ్యం. ఐశ్వ‌ర్య నేను విడిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. వ్య‌క్తిగ‌తంగా స‌మ‌యం తీసుకోవాల‌ని అనుకుంటున్నం. మా నిర్ణ‌యాన్ని అంద‌రూ గౌర‌వించండి. అలాగే ఈ ప‌రిస్థితుల్లో వ్య‌క్తిగ‌త గోప్య‌త అవ‌స‌రం” అంటూ హీరో ధ‌నుష్ ట్విట్ట‌ర్ లో లేఖ ను పోస్టు చేశాడు. అలాగే ఐశ్వ‌ర్య కూడా ఇదే లేఖ ను త న ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. దీనికి ఎలాంటి క్యాప్ష‌న్ అవ‌స‌రం లేద‌ని రాసుకువ‌చ్చింది.

 

ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటార‌ని భావిస్తున్నాని అన్నారు. అయితే హీరో ధ‌నుష్, ఐశ్వ‌ర్య దంప‌తులు విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త దాదాపు అంద‌రినీ షాక్ కు గురి చేసింది. అన్యోన్య దంపతులుగా ఉండే ధ‌నుష్, ఐశ్వ‌ర్య ఎందుకు విడాకుల తీసుకుంటున్నారో తెలియాల్సి ఉంది. కాగ ధ‌నుష్, ఐశ్వ‌ర్య ల వివాహం 2004 లో అయింది. అంటే 18 ఏళ్ల వివాహ బంధానికి ఇప్పుడు ముగింపు ప‌లికారు.

Read more RELATED
Recommended to you

Latest news