పునీత్ మృతి.. హీరో విశాల్ సంచలన నిర్ణయం !

-

తిరుమల శ్రీవారిని ఇవాళ హీరో విశాల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో విశాల్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కాలిబాటన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించు కోవాలనే కోరిక ఇవాళ తీరిందన్నారు. పునీత్ రాజ్ కుమార్ తమ ఇంటి లో మనిషి అని… ఎన్ని రోజులైనా తమ మనస్సులో అలానే వున్నాడని స్పష్టం చేశారు విశాల్. పునీత్ నిర్వహిస్తూన్న కార్యక్రమం ఆగకూడదు అనే 1800 మంది విద్యార్థులు భాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు.

ఇల్లు కోనాలనుకోని డబ్బును సమకూర్చుకున్నానని అయితే ఆ డబ్బునే విధ్యార్దులు చదువుకు కేటాయిస్తూన్నానని సంచలన ప్రకటన చేశారు. పునీత్ అన్నయ్య చదివిస్తున్న వారిని తాను చదివిస్తానన్నారు. ఇల్లు వచ్చే ఏడాది అయినా కొనుకోవచ్చు….. కానీ అన్న బాధ్యత తీర్చాలని సంకల్పించానని పేర్కొన్నారు విశాల్. పునీత్ అన్నయ్య ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చారని గుర్తు చేశారు. దీపావళి కి తమిళ, తెలుగు భాషలలో ఎనిమి చిత్రం విడుదలవుతుందని.. అందరూ థియేటర్లలో చూడాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news