త్వరలోనే ఓటీటీలోకి ‘హిడింబ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

అశ్విన్‌ బాబు హీరోగా.. నందిత శ్వేత హీరోయిన్​గా.. అనిల్ క‌న్నెగంటి తెర‌కెక్కించిన సినిమా ‘హిడింబ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్‌ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఆహా వేదికగా ఆగస్టు 10వ తేది రాత్రి 7గంటల నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హిడింబ స్టోరీ ఏంటో తెలుసా…. : అభ‌య్ (అశ్విన్‌బాబు), ఆద్య (నందితా శ్వేత‌) పోలీస్ ట్రైనింగ్​ తీసుకుంటున్న సమయంలో లవ్​లో పడతారు. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోతారు. ఆ త‌ర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీస‌ర్ అవుతుంది. అభ‌య్ మాత్రం హైదరాబాద్‌లో పోలీస్‌ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్లిద్ద‌రూ న‌గ‌రంలో జ‌రుగుతున్న అమ్మాయిల సీరియ‌ల్ కిడ్నాప్‌ల‌కు సంబంధించిన కేసులో కలిసి పని చేయాల్సి వస్తుంది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్ర‌మంలో కాలా బండ‌లోని బోయ అనే క‌రుడుగ‌ట్టిన ముఠాను ప‌ట్టుకుంటారు. వాళ్ల చెర‌లో ఉన్న అమ్మాయిలంద‌రినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసిన‌ట్లే అనుకుంటున్న త‌రుణంలో న‌గ‌రంలో మ‌ళ్లీ మ‌రో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మ‌రి ఈ కేసును ఆద్య‌, అభ‌య్ ఎలా ఛేదించారు? అన్న‌ది ఆహాలో చూసి తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news