రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది..!

-

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం భోళాశంకర్.. ఆగస్టు 11వ తారీఖున విడుదలకు సిద్ధం కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు.ఇందులో భాగంగానే ఇటీవల రెండవ పాటను కూడా విడుదల చేయగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి..

గతంలో చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్, హిట్లర్ , శంకర్ దాదా ఎంబిబిఎస్ తరహా రీతిలో భోళాశంకర్ అభిమానులకు కావలసిన అన్ని అభిరుచులను అందిస్తుంది అంటూ హైపర్ ఆది వెల్లడించారు. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, మాస్ యాక్షన్స్, ఫైట్స్ , సన్నివేశాలు అన్నీ కూడా అభిమానులకు నచ్చే రీతిలోనే దర్శకుడు మెహర్ రమేష్ డిజైన్ చేసినట్లు హైపర్ ఆది చెప్పుకొచ్చారు. ఒకప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ఫ్లాప్ అయిన శక్తి అలాగే షాడో సినిమాలను కొంతమంది ట్రోల్ చేశారు. కానీ ప్రభాస్ కెరియర్ లో అత్యంత మోస్ట్ స్టైలిష్ సినిమా బిల్లా తీసింది కూడా ఇతనే కదా అంటూ మెహర్ రమేష్ దర్శకత్వాన్ని ఆకాశానికి ఇచ్చేశారు హైపర్ ఆది.

ఇదిలా ఉండగా మరొకపక్క ఇదే సమయంలో రిలీజ్ చేస్తున్న పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు తన పుట్టినరోజు వేడుకలు జరిగాయని.. మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని గౌరవించే ఫ్యామిలీ అని ఆయన తెలిపారు. ఒకపక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు మరోపక్క అన్నయ్య ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ప్రజల కోసం ఎప్పుడూ మంచి చేయాలని భావించే తపన ఆ ఫ్యామిలీకి ఉంది అంటూ తెలిపారు. ఇకపోతే వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే వరకు ఈ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు అవన్నీ పట్టించుకోవద్దు అంటూ ప్రజలకు పిలుపు నిస్తూ రోజాకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు హైపర్ ఆది. మొత్తానికి అయితే ఆది చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news