ఇంతలా గుండెల్లో పెట్టుకుంటారని తెలీదు.. తెలుగు ఆడియన్స్‌కు స్పెషల్ థాంక్స్ : ఎస్ జే సూర్య

-

నేచురల్ స్టార్ నాని హీరోగా, తమిళ నటుడు ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా నటించిన ‘సరిపోదా శనివారం’మూవీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. దీంతో మూవీ టీం సక్సెస్ మీట్ ను నిర్వహించింది. సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఎస్ జే సూర్య మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు మధురైలో మూవీ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చినట్లు పేర్కొన్నారు.

‘ఈరోజే నేను మధురైలో షూటింగ్ చేయాల్సి ఉండేది.కానీ, షూట్ క్యాన్సిల్ చేయాలని నిర్మాతలను కోరాను. దీనికి అయ్యే ఖర్చును కూడా నేనే భరిస్తానని చెప్పాను. నాపై అపారమైన ప్రేమను కురిపించిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపేందుకు హైదరాబాద్ వచ్చా’ అని ఆయన తెలిపారు. కాగా, తల్లి సెంటిమెంట్‌తో తెరకెక్కిక సరిపోదా శనివారం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news