ఇదే పూరి జగన్నాధ్ డెసిషన్ అయితే రాంగ్ స్టెప్ అవుతుందేమో అంటున్నారే ..?

-

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీని సంపాదించుకున్న పూరి జగన్నాథ్ చాలా కాలంగా సక్సస్ లు లేక మంచి కసి తో ఉండి ఇస్మార్ట్ శంకర్ తీశారు. ఈ సినిమా సక్సస్ తో మళ్ళీ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. పూరి జగన్నాధ్ కొట్టిన సక్సస్ మూవీ ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ వరసగా ప్లాప్ అవుతు వచ్చాయి. ఆఖరికి కొడుకుతో తీసిన మెహబూబా సినిమా కూడా పూరి కి నిరాశనే మిగిల్చింది.

 

అయితే ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా అటు పూరీకి, ఇటు రామ్ కి, సంగీతం అందించిన మణిశర్మకి, హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్ .. ఇలా టీం అందరికి మంచి సక్సస్ ని ఇచ్చింది. మెహబూబా సినిమా తర్వాత ఇక డైరెక్టర్ గా పూరి దగ్గర మ్యాటర్ లేదనుకున్న వాళ్ళందరికి ఇస్మార్ట్ శంకర్ తో షాకిచ్చారు.

దాంతో ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాధ్ విజయ్ హీరోగా ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాగ్డ్రాప్ లో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని తెరకెక్కిస్తున్నారు పూరి. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరే బాప్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రికార్డ్ కూడా ఉంది.

అయితే విజయ దేవరకొండ సినిమా గనక హిట్ కొడితే బాలీవుడ్ లో నే నెక్స్ట్ సినిమాలు చేయడానికి మేకర్స్ రెడీగా ఉన్నారట. అయితే ఇవన్ని పక్కన పెట్టి మళ్ళీ తెలుగులోనే నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటున్నారట. అందుకే ప్రస్తుతం ఒక స్టార్ హీరో కొసం కథ రాస్తున్నట్టు ఇంతకముందు పూరి చెప్పారు. కాని ఆ కథ ఎవరికొసమన్నది మాత్రం క్లారిటి ఇవ్వలేదు. కాని పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటే పవన్ కళ్యాణ్ లేదా బాలకృష్ణ తో అని మాత్రం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏది నిజమో పూరి జగన్నాధ్ క్లారిటి ఇస్తేనే అందరికి తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news