స్టేజ్ పైనే వర్షకు తాళి కట్టిన ఇమ్మానుయేల్ .. షాక్ లో ఆడియన్స్.. వీడియో వైరల్..!

-

జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న కపుల్స్ లో వర్ష, ఇమ్మానుయేల్ జంట కూడా ఒకటి. చాలా స్కిట్ లలో తమ మధ్య ప్రేమ ఉన్నట్లుగా వీరిద్దరు నటించారు. అలాగే స్కిట్ అయిపోయాక ఇమ్మానుయేల్ పై వర్ష ఎంతో ప్రేమ ఉన్నట్లు చాలా సందర్భాలలో ఆమె స్వయంగా వెల్లడించింది. ఒక స్థితిలో వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేసి చూపించారు. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి న్యాయ నిర్ణేతగా నటుడు పోసాని కృష్ణమురళి వచ్చారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వర్ష , ఇమ్మానుయేల్ మధ్య లవ్ ట్రాక్ చూపించడంతో నిజంగానే మీ మధ్య ప్రేమ ఉందా అని పోసాని అడిగారు. అప్పుడు ఇమ్మానుయేల్ మాట్లాడుతూ.. ప్రోమో వరకు మాత్రమే డైలాగులు చెబుతుంది.. తర్వాత కంటికి కూడా కనిపించదు సార్ అని వర్షాపై ఇమ్మానుయేల్ సెటైర్ వేశాడు.

ఇది చూసిన పోసాని కృష్ణమురళి.. ఇమ్మానుయేల్ ఒక క్లారిఫికేషన్ కావాలి .. మీ ఇద్దరి మధ్య లవ్ ఉందిగా. అని అడిగారు.. అప్పుడు ఇమ్మానుయేల్ సమాధానం ఇస్తూ.. ఆ అమ్మాయే చెప్పాలి సార్ అని చెప్పాడు. దీనికి మెచ్చిన పోసాని అతడి స్ట్రైట్ ఫార్వర్డ్ కి లవ్ యు అంటూ చెప్పాడు పోసాని. తర్వాత గెటప్ శ్రీను తాళి తీసుకురావడంతో స్టేజి పైనే అందరి ముందే వర్షాకు ఇమ్మానుయేల్ తాళి కట్టాడు. సిగ్గుతో తలవంచింది వర్ష. కానీ అప్పుడు బాబు.. బాబూ..అంటూ పోసాని అరవడం యాంకర్ రష్మి తో పాటు ఆడియన్స్ కూడా షాక్ లో ఉండిపోవడం మనం చూడవచ్చు . అయితే తాజాగా ఇదంతా ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి విడుదల చేసిన ప్రోమోలో చూపించారు . మరి నిజంగానే వీరు వివాహం చేసుకున్నారా? లేక ప్రోమో కోసమా తెలియాలి అంటే నవంబర్ 11న టెలికాస్ట్ అయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news