పవన్ కళ్యాణ్ డ్యుయల్ రోల్ అదిరిందిగా.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్‌..

-

‘అజ్ఞాత‌వాసి’ సినిమా త‌ర్వాత పూర్తి రాజ‌కీయాల‌తో బిజీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై రీఎంట్రీ ఇచ్చాడు. అంటే రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రెండేళ్లు అభిమానులు ఆయన్ను చాలా మిస్సయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు సంవత్సరాలు పవన్ సినిమాల్లో లేని లోటును వ్యక్తపరుస్తూ వచ్చిన ఫ్యాన్స్ అనేకసార్లు ఇంకొక్క సినిమా చేయమని కోరుతూ వచ్చారు. అయితే వారి కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో హిట్ అయిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కనిపించనున్నాడు.

ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడు. అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నిన్న‌టి నుండే సెట్స్ పైకి వెళ్లింది. ఈ క్ర‌మంలోనే తాజాగా సెట్‌లో కూడా అడుగుపెట్టాడు పవర్ స్టార్. అయితే జనసేనాని కూడా ఇంకా లోపల అలాగే ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే అక్కడ్నుంచి నేరుగా మళ్లీ జనసేన కార్యాలయానికి వెళ్లి మిగిలిన కార్యక్రమాలు చూసుకుంటున్నాడు పవన్ కల్యాణ్.

సినిమాలు చేస్తున్నాడు కదా అని జనసేనానిని మనసులోనే తొక్కేయడం లేదు పవన్ కల్యాణ్. అమరావతి రైతుల కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జనసేన అధ్యక్షుడు. మరోవైపు సినిమా హీరో పవన్ కల్యాణ్ మాదిరి పింక్ సినిమా రీమేక్ షూటింగ్ చేసుకుంటున్నాడు. అంటే డ్యుయ‌ల్ రోల్‌లాగా.. అటు రాజ‌కీయాల్లోనూ.. ఇటు సినిమాల్లోనూ ఉండ‌డానికి ప్ర‌య‌త్రిస్తున్నారు. ఇలా రెండు పాత్రలను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు ఈయన. దీంతో ఫ్యాన్స్ ఎంతో గ‌ర్వంగా పండ‌గ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news