సమంత సినిమాతో గుణశేఖర్ రిస్క్ చేస్తున్నారా..?

-

తెలుగులో సినిమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే డైరెక్టర్లలో గుణశేఖర్ కూడా ఒకరిని చెప్పవచ్చు. దర్శకత్వం నుంచి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవ్వడమే కాకుండా మంచి హిట్టు కూడా సాధించాయి. ముఖ్యంగా ఈ దర్శకుడు స్క్రీన్ ప్లే కి చాలామంది అభిమానులున్నారని చెప్పవచ్చు. అలాంటి స్క్రీన్ తో మహేష్ కు ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇచ్చారు. ఇక తర్వాత రుద్రమదేవి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమానీ తన సొంత బ్యానర్ పైనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా త్రీడీ తో తీసిన పెద్దగా త్రీడీ వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో 3d సినిమాలు అంటే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే భయపడుతూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు రాజమౌళి కూడా 3d సినిమాల జోలికి వెళ్లలేదు. అయినప్పటికీ కూడా డైరెక్టర్ గుణశేఖర్ మాత్రం ఇప్పుడు సమంతాతో కలిసి శాకుంతలం సినిమాని త్రీడీలో చూపించాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం మరింత డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా రిజల్టు ఉంటుందా .. అనే విషయంపై గుణశేఖర్ అభిమానులలో సమంతా అభిమానులలో ఒక ప్రశ్న మొదలవుతోంది.

ఇప్పటికే ఈ సినిమా పైన భారీగానే ఖర్చు చేశారు . ఇక ఈ సినిమాని త్రీడీలో చూపించేందుకు మరింత ఖర్చు చేసి బడ్జెట్ పెంచేలా చేస్తున్నారు. అయితే ఇది మాత్రం చాలా రిస్క్ అని కొంతమంది నెటిజెన్లు సైతం తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అయితే ఇప్పుడు తాజాగా మరొక కొత్త డేట్ ను ప్రకటించబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news