ఒకే ఫ్రేమ్‌లో సూపర్ స్టార్ ఫ్యామిలీ.. మ‌రో `మ‌నం` రాబోతుంది..!

-

ఇటీవ‌ల స‌రిలేరు నీకెవ్వ‌రూ చిత్రంతో సూప‌ర్ హిట్ స‌క్సెస్‌ను అందుకున్న మ‌హేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో స్టేట్స్‌లో ఎంజాయ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్కడి నుంచి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి చిత్రంలో నటించబోతున్నారు. సినిమాలోనే ఘట్టమనేని కుటుంబంలోని నటులంతా కలిసి నటించబోతున్నారని తాజాగా ఓ వార్త లీకైంది. మహేశ్ బాబు హీరోగా చేస్తున్న ఈ మూవీలో కృష్ణ, గౌతమ్ (మహేశ్ కొడుకు) కూడా కీలక పాత్రలు చేస్తున్నారట. అలాగే, నమ్రత శిరోద్కర్ అతిథి పాత్రలో మెరవబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో సితార (మహేశ్ కూతురు) ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుందట.

ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని తెలిసింది. కాగా, అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు నాగేశ్వర్రావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం ‘మనం’. వీరితో పాటు ఇందులో అమల, అఖిల్ కూడా నటించారు. ఈ చిత్రం సూప‌ర్ హిట్ అయ‌న సంగ‌తి తెలిసిందే. మనం సూపర్ హిట్ అవడంతో అదే తరహా సినిమా చేయాలని ఇండస్ట్రీలోని చాలా ఫ్యామిలీలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో ఆ సారి ఘట్టమనేని ఫ్యామిలీతో మ‌రో మనం లాంటి సినిమా రాబోతుంద‌న్నమాట‌.

Read more RELATED
Recommended to you

Latest news