ఓటీటీలోకి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

అల్లరి నరేశ్​.. గత కొన్నేళ్లుగా కామెడీ సినిమాలను పక్కనపెట్టి కాన్సెస్ట్ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మహర్షి, నాంది సినిమాలతో ఇప్పటికే తనలో ఉన్న వర్సటాలిటీని బయటపెట్టాడు ఈ అల్లరి హీరో. ఈ మూవీస్​కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ జానర్​ మూవీస్​పై కాన్సంట్రేట్ చేశాడు. అందులో భాగంగానే ఇటీవల ఇ్టలు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

థియేటర్​లో రిలీజ్ అయి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందట. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఓటీటీ హక్కులను జీ5 ప్లాట్​ఫామ్ కొనుగోలు చేసింది. ఈ సినిమా డిసెంబర్ 23 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి ఈ ఓటీటీ అధికారిక ప్రకటన చేసింది.

ఈ సినిమాలో మారుమూల ప్రాంతమైన మారేడిమిల్లిలో ఎలక్షన్ నిర్వహించే పోలింగ్ అధికారి పాత్రలో అల్లరి నరేశ్ ఆకట్టుకున్నాడు. ఈ మూవీ ద్వారా అడవుల్లో నివసించే గిరిజన ప్రజలు సరైన వసతులు లేక పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version