‘జాను’ సినిమా దెబ్బకి దిల్ రాజు కి ఎంత లాస్ వచ్చిందో తెలిస్తే మీరు కళ్ళు తేలేస్తారు !

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలు తీయాలన్న మంచి క్లాస్ సినిమాలు నిర్మించాలన్న అలాంటి సినిమా స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ దిల్ రాజు. తాజాగా ఇటీవల దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సమంత మరియు శర్వానంద్ కలిసి నటించిన ‘జాను’ సినిమా భారీ స్థాయిలో విడుదల అయింది. తమిళంలో ‘96’ సినిమా టీజర్ చూసి తెగ నచ్చడంతో చెన్నై వెళ్లి మరి ప్రివ్యూ దిల్ రాజు చూశాడు. దీంతో ఇంప్రెస్ అయిన దిల్ రాజు తెలుగులో రీమేక్ హక్కులు వెంటనే కొనేశాడు. తమిళంలో హిట్ అవడంతో పైగా సినిమాకి క్లాసిక్ అన్న పేరు రావడంతో తెగ ఉత్సాహం తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ని స్టార్ట్ చేశాడు.

Image result for jaanu movie dil raju

అయితే సినిమా స్టార్ట్ చేసిన సందర్భంలో దిల్ రాజుని అందరూ పిచ్చోడు అనుకున్నారని సినిమా ప్రమోషన్ సమయంలో స్వయంగా దిల్ రాజు చెప్పటం జరిగింది. అయితే తాను పొందిన అనుభూతి తెలుగు ప్రేక్షకులు కూడా పొందాలని ఈ సినిమాని రీమేక్ చేసినట్లు చెప్పుకొచ్చారు. తమిళంలో ఈ సినిమా హీరో హీరోయిన్లుగా నటించిన విజయ్ సేతుపతి – త్రిష జంటలకు ఎంతో మంచి పేరు రావటం జరిగింది. ఆ విధంగానే తెలుగులో సినిమా చూసే ప్రేక్షకులకు కలగాలని సమంత- శర్వానంద్ చేత ‘జాను’ సినిమా చేయించినట్లు దిల్ రాజు ప్రమోషన్ సమయంలో చెప్పారు. అతి తక్కువ బడ్జెట్ లో సినిమాని నిర్మించి తక్కువ టైం లో కంప్లైంట్ చేశారు.

 

అదే సమయంలో భారీ బడ్జెట్ రేట్లు ఎక్కడ పెట్టకుండా డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది కలగకుండా చిత్రాన్ని అమ్మేశారు. అంతా బానే ఉంది సినిమా రిలీజయ్యాక మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. చూసిన ఆడియన్స్ కూడా పాజిటివ్ గానే స్పందించారు. కాగా కలెక్షన్ విషయంలో మాత్రం దిల్ రాజుకి చాలా లాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ‘జాను’ సినిమాకి సంబంధించి భారీగానే దిల్ రాజు నష్టపోయినట్లు టాక్. ఇండస్ట్రీ నుండి అందుతున్న లెక్కలను బట్టి దాదాపు 7-8 కోట్ల వరకూ ఈ అగ్ర నిర్మాతకు నష్టం వచ్చినట్టు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందని కలెక్షన్లు అదరగొడుతున్నయి అన్న వారికి ఈ లెక్కలు విని ఒక్కసారిగా కళ్లు తేల్చేస్తున్నారు. మరి ఈ చిన్న నష్టం విషయంలో మరోసారి రీమేక్ సినిమా జోలికి దిల్ రాజు వెళతారో లేదో చూడాలి. 

Read more RELATED
Recommended to you

Latest news