ఎందుకు పూరి అంత చిన్న సీన్ కి 5 కోట్లు .. చిన్న సినిమా తీయొచ్చు తెలుసా .?

-

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనిపేరు సంపాదించుకున్నారు పూరి జగన్నాధ్. తన పేరుకు తగ్గట్లుగానే ఫిల్మ్ మేకింగ్ విషయంలో కూడా ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు. ఈ విషయంలో అసలు సందేహం లేదు. ఎందుకంటే ఆయన తీసే సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇక పూరి గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాప్ లతో సతమతమయ్యారు. దాదాపు అందరు పూరి సినిమా కెరీర్ ఇక క్లోజ్ అయినట్టేనని అనుకుంటున్న సమయంలో పెద్ద షాకిచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి ఈజ్ బ్యాక్ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేస్కున్నారు. ఈ సినిమా హీరో తో సహా పూరి టీం మొత్తానికి మాంచి కిక్ ఇచ్చింది. ఆ కిక్ తో పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాలతో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

 

 

ఇక ఈ సినిమాను చాలా ఎగ్జైటింగ్ తో పూరి రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను పూరి.. చార్మి పాటు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ.. తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఒకేఅకంగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కేవలం ఆరు నుండి ఏడు నిమిషాల సీన్స్ కోసం ఏకంగా అయిదు కోట్ల తో ముంబయిలో సెట్ ను వేయిస్తున్నారట పూరి టీం. పది నిమిషాలు కూడా ఉండని ఆ సీన్స్ కు అంత ఖర్చు అవసరమా అంటూ కొందరు పూరి ని కామెంట్ చేస్తున్నారు.

కరణ్ జోహార్ కూడా ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ లో భాగస్వామి అయ్యారు కాబట్టే బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకాడకుండా పూరి భారీగా ఖర్చు పెడుతున్నారట. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నిటిలో ఈ సినిమానే భారీ బడ్జెట్ సినిమా అని చెప్పుకుంటున్నారు. అయితే ఇలా 5 కోట్లు పెట్టి ఒక సీన్ తీయడం అవసరమా ఆ బడ్జెట్ తో ఒక చిన్న సినిమా తీసేయొచ్చుగా…అంటూ చాలామంది అంటున్నారు. ఆలోచిస్తే నిజమే కదా ..!

Read more RELATED
Recommended to you

Latest news