చోటే మియాతో జాన్వి కపూర్?

-

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వికపూర్ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ భామ ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శ్రీదేవి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది.

ఇది ఇలా ఉండగా, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ‘బడే మియా చోటే మియా’. ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. టైగర్ సరసన జాన్వి నటించనుంది. ఆ పాత్ర కోసం జాన్వినే దర్శకుడు అబ్బాస్ కోరుకుంటున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇందులో అక్షయ్ కుమార్ కు జోడి ఎవరు ఉండరట. వచ్చే నెల లండన్ లో జరగనున్న షెడ్యూల్ లో జాన్వి పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news