పెళ్ళికి ముందే ప్రియుడితో కలిసి తిరుమలలో దర్శనమిచ్చిన జాన్వీ కపూర్

-

అలనాటి అందాల నటి శ్రీదేవి వారసురాలిగా అడుగుపెట్టిన భామ జాన్వి కపూర్.. అయితే మొదటి నుంచి అందాలు ఆరబోయటంలో ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ భామ రోజు రోజుకి సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంది.. తన హాట్ అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది మతి పోగొట్టే అందంతో అందాల విందు చేస్తుంది.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే, జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో సినిమాతో ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉండగా, తాజాగా జాన్వి తన గాసిప్ ప్రియుడు అయినటువంటి శిఖర్ పహారియాతో కలిసి తిరుమలలో మెరిసింది. వీళ్ళిద్దరూ కలిసి తిరుమల లో శ్రీవారి సన్నిధిలో కలిసి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో జాన్వీ ట్రెడిషనల్ వేర్ లో చాలా చక్కగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news