కాజ‌ల్‌తో ఫోటోల‌కు పోజిలిచ్చిన చంద‌మామ‌..!!

-

సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించారు. కుటుంబంతో కలిసి సింగపూర్‌కు చేరుకున్న ఈ చందమామ.. అక్కడి మేడమ్‌ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన తన విగ్రహంతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌​ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఇక‌ మైనపు బొమ్మ ఏదో, నిజమైన కాజల్ ఎవరో గుర్తు పట్టాలంటే కష్టమే. దీంతో తమ అభిమాన హీరోయిన్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కాజల్‌ ఫ్యాన్స్‌ నెట్టింట సందడి చేస్తున్నారు. ఇక లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్‌.. తెలుగుతో పాటు తమిళంలోనూ అగ్రతారగా గుర్తింపు తెచ్చుకున్నారు.

దాదాపు 12 ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాతో పాటు, లోకనాయకుడు కమల్ హాసన్- స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నారు. కాగా, ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు సినీనటులు మహేశ్ బాబు, ప్రభాస్ విగ్రహాలు ఉన్నాయి. బాలీవుడ్‌ నటుల్లో అమితాబ్, హృతిక్, కాజోల్ వంటి పలువురి బొమ్మలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news