Kantara 2: రిషబ్ శెట్టి పారితోషకం అన్ని కోట్లా..?

-

Kantara 2.. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు కన్నడ హీరో రిషబ్ శెట్టి.. చిన్న సినిమాగా కాంతారా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని భాషల్లో కూడా తన సత్తా చాటింది. ఎన్నో అవార్డులను, రివార్డులను కూడా అందుకుంది ఈ సినిమా.. కన్నడ పరిశ్రమను కేజిఎఫ్ నిలబడితే.. కాంతారా సినిమా ఆ రేంజ్ ను సుస్థిరంగా మార్చింది. ఈ రెండు సినిమాలు కన్నడ ఇండస్ట్రీ రేంజ్ను అమాంతం పెంచేసాయి. ఇకపోతే కాంతారా సీక్వెల్ కూడా ఉంది అని చెప్పిన రిషబ్ శెట్టి ఎప్పుడు మొదలు పెడతారు అని మాత్రం వెల్లడించలేదు.

 

ఉగాది రోజున శుభవార్త చెబుతూ కాంతారా 2 స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి అంటూ తెలిపారు. దీంతో ఏడాదిలోపే షూటింగ్ ముగించేస్తారు అనే ధీమా కూడా అభిమానులలో వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ కి రిషబ్ శెట్టి తీసుకుంటున్న పారితోషకం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాంతారా సినిమాకు రిషబ్ కేవలం రూ.5 కోట్లు మాత్రమే తీసుకున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే రూ.16 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే కాంతారా 2 కోసం కళ్ళు చెదిరే పారుతోషకం తీసుకోబోతున్నారని సమాచారం.

రిషబ్ శెట్టి కాంతార 2 సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటున్నారట. రూ. 50 కోట్లు పారితోషకం రూపంలో.. రూ. 50 కోట్లు బిజినెస్ లో షేర్ తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఆయన రేంజ్ను బట్టి, డిమాండ్ ను బట్టి, రూ.5 కోట్లు ఎక్కడ.. రూ.100 కోట్లు ఎక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news