TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు

-

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసిన అధికారులు తాజాగా మరొకరిని అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్‌ను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది.

రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కీలక సమాచారంతో ప్రశాంత్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గ్రూప్‌-1 పరీక్ష పేపర్‌ను కొనుగోలు చేసిన ప్రశాంత్‌.. 100కుపైగా మార్కులు తెచ్చుకున్నట్లు సిట్‌ ఆధారాలు సేకరించింది. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్‌ మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్.. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు కావాలనే ఓఎంఆర్ షీటులో బబ్లింగ్ తప్పుగా చేశాడని పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడతాననే భయంతోనే కావాలనే డిస్ క్వాలిఫై చేసుకున్నాడని సందేహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news