యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకుంటున్న కార్తీ ‘దొంగ’ ట్రైలర్…..!!

-

కార్తీ హీరోగా ఇటీవల లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకకాలంలో రిలీజ్ అయిన ఆ సినిమా, నిర్మాతలకు మరియు బయ్యర్లకు కాసులు కురిపించింది. దాని తరువాత కార్తీ నటిస్తున్న తాజా సినిమా దొంగ. తన వదిన అయిన జ్యోతిక ఈ సినిమాలో కార్తీకి అక్కగా నటిస్తోంది. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్స్ ఈ సినిమాను  సంయుక్తంగా నిర్మించాయి.

హర్షిత మూవీస్‌ అధినేత రావూరి వి. శ్రీనివాస్‌ దీనిని తెలుగులో అందిస్తున్నారు. ఇక ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితం నటుడు సూర్య తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. సత్యరాజ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి నటి షావుకారు జానకి, సీనియర్ నటి సీత, నిఖిల విమల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ లో ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్నే హీరోగా పెట్టాలి’ అలానే చివరిలో ‘అక్క అంటే ఇద్దరు అమ్మలతో సమానం’ అంటూ హీరో కార్తీ పలికే రెండు డైలాగ్స్  చాలా బాగున్నాయి.

సెంటిమెంట్, లవ్, ఎమోషనల్ గా మంచి ఎంటర్టైన్మెంట్ కలగలిపిన ఈ ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా కూడా కార్తీ ఖాతాలో మరొక విజయాన్ని అందించేలా అనిపిష్తోంది. ఎప్పుడో చిన్నపుడు తప్పిపోయిన తమ్ముడికోసం ఒక అక్క పడే తపనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథను దర్శకుడు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఆర్ డి రాజశేఖర్ ఫోటోగ్రఫిని అందిస్తున్న ఈ సినిమాకు గోవింద వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఈనెల 20న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు…….!!

Read more RELATED
Recommended to you

Latest news