ఓటీటీలోకి ‘కీడా కోలా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

-

ఇటీవల టాలీవుడ్​లో రిలీజ్ అయిన సినిమాల్లో సూపర్ కామెడీతో అలరించిన చిత్రాల్లో మొదటి స్థానంలో ఉంటుంది కీడాకోలా చిత్రం. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇందులో ఆయన కూడా నటించాడు. క్రైమ్ కామెడీతో ఆద్యంతం అలరించేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ రిలీజ్ నుంచి సినిమా రిలీజ్ వరకు ఈ చిత్రానికి సూపర్ హైప్ వచ్చింది. నవంబర్ 3వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత నుంచి ఈ సినిమాకు సంబంధించి పోస్టులు, రీల్స్​ నెట్టింట హల్​చల్ చేస్తున్నాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయింది. డిసెంబర్ 8వ తేదీ నుంచి ఈ చిత్రం ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ కోలా తాగుతూ కీడాకోలా మూవీ ఎంజాయ్ చేసేయండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news