హీరోల కంటే ముందు తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కీర్తి సురేష్ ..!

-

టాలీవుడ్ లో నేను శైలజ, నేను లోకల్, మ‌హాన‌టి అజ్ఞాతవాసి సినిమాలతో స్టార్ హీరోయిన్ కేటగిరీలో చేరింది కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు తమిళంలో వరసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరో నితిన్ తో రంగ్ దే సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమాతో పాటు పెంగ్విన్ అనే ద్విభాషా చిత్రంలోను నటించింది.

 

అయితే ఈ సినిమాని ఇన్ని రోజులు ఎలా రిలీజ్ చేయాలి అన్న డైలమాలో ఉన్నారు మేకర్స్. లాక్ డౌన్ కారణంగా సౌత్ అండ్ నార్త్ లలో ఇప్పట్లో సినిమాలను రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో గత కొన్ని రోజులుగా కొన్ని సినిమాలని ఓ.టీ.టీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎట్టకేలకి హీరోల కంటే ముందు కీర్తి సురేష్ తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కీర్తి సురేష్ నటించిన తాజా సినిమా పెంగ్విన్. ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థ‌నంతో తెరకెక్కించిన ఈ సినిమాకి ఈశ్వ‌ర్ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

స్టోన్ బెంచ్ ఫిల్మ్ ప‌తాకం పై మరో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక మ‌హాన‌టి చిత్రానికి థియేట‌ర్ లోనే కాదు వ‌ర‌ల్డ్ బెస్ట్ ఆన్ లైన్ స్టీమింగ్ నెట‌వ‌ర్క్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా విశేష ఆద‌ర‌ణ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పెంగ్విన్ సినిమాని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్‌క్లూజివ్ గా ఆడియెన్స్‌కి అందించ‌బోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జూన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా పెంగ్వీన్ కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news