బాల‌య్య సినిమాకు కీర్తి కూడా నో.. చివ‌ర‌కు ఆ హీరోయినే ఫిక్స్‌..!

-

నటసింహా నందమూరి బాలకృష్ణతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ‘సింహా’, ‘లెజెండ్’ మాదిరిగానే ఈ సినిమాను కూడా బ్లాక్ బస్టర్ చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ సినిమాను హిట్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలను ఆయన వినియోగించుకునే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారు, కథేంటి, టైటిల్‌ ఇదేనా అంటూ సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేయడానికి బోయపాటి బృందం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా నయనతారను అనుకున్నారు. అయితే తనకి గల కమిట్మెంట్స్ కారణంగా కుదరదని నయనతార చెప్పిందట .. దాంతో శ్రియను తీసుకున్నారు.

ఇక మరో కథానాయిక పాత్ర కోసం కీర్తి సురేశ్ ను సంప్రదించారట. ఆమె కూడా తన డేట్స్ లేవంటూ సున్నితంగానే తిరస్కరించినట్టు సమాచారం. ఆ సమయంలోనే కేథరిన్ ను సంప్రదించగా, భారీ పారితోషికాన్ని అడిగిందట. అప్పుడే అంజలి పేరును పరిశీలించి ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో ‘డిక్టేటర్’ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా అంజలి కనిపించింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో అంజలికి కూడా ఇక్కడ అవకాశాలు లేకుండా పోయాయి. బోయపాటి సినిమాతో ఆమె కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news