నేడు మొయినాబాద్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు

-

హైదరాబాద్‌: నేడు టాలీవుడ్‌ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు గారి అంత్యక్రియలు జరుగనున్నాయి. కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అధికార లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు చేవెళ్ల, మొయినాబాద్ దగ్గర లోని కనక మామిడి ఫామ్ హౌస్ లో మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు గారి అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన ఇంటి నుండి ఇవాళ ఉదయం 11:30 గంటలకు పార్థివదేహం బయలుదేరుతుంది. ఇక కృష్ణం రాజు గారి అంతిమ యాత్రలో… పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

కాగా.. కృష్ణంరాజు ఇక లేరన్న వార్త అభిమానులను కలచివేసింది. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కృష్ణంరాజు చివరి శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చివరి చూపు కోసం ప్రజలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. సోమవారం మధ్యాహ్నము అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులతోపాటు పలువురు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version