రేపటి నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం

-

కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్‌ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ప్రతీ ఏడాది లక్షలాది మంది యువత పోటీ పడుతుంటారు. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌  2024 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తికాగా.. రేపటి నుంచి మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా యూపీఎస్సీ జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా.. ఫలితాలు జులై 1న విడుదలయ్యాయి.

షెడ్యూల్‌ ప్రకారం.. మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్‌ 20, 21, 22, 28, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌ పరీక్ష మూడు గంటల పాటు జరుగుతుంది. మెయిన్స్‌ పరీక్షలు మొత్తం ఐదు రోజుల పాటు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 24 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో మెయిన్స్‌ పరీక్షల కోసం 6 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 708 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version