అరుదైన జబ్బుతో బాధపడుతున్న లావణ్య త్రిపాఠి!

-

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మొదట అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. ఈ ఏడాది మెగా హీరో వరుణ్ తేజ్ ని వివాహం చేసుకోబోతోంది. గత కొద్దిరోజుల క్రితం లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది.. ప్రస్తుతం వీరిద్దరూ జాలీగా పలు రకాల ట్రిప్పులను ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇకపోతే లావణ్య త్రిపాఠికి ఒక అరుదైన వ్యాధి ఉందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.. వాస్తవానికి ఈమెకు ట్రిపోఫోబియా అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు లావణ్య త్రిపాఠి గతంలో తెలియజేసినట్లు సమాచారం. ఈ వ్యాధి వల్ల కొన్ని వస్తువులను చూస్తే తెలియకుండానే తనలో భయం కలుగుతుందట.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు తను చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నానని రెండేళ్ల క్రితం తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

2017లో వచ్చిన మిస్టర్ సినిమా సమయంలో వరుణ్ తేజ్ , లావణ్య ఇద్దరూ ప్రేమలో పడ్డారట.. ఆ తర్వాత ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో అంతరిక్షం సినిమా విడుదల అయ్యింది. అలా మరింత ప్రేమ వీరిద్దరి మధ్య పెరగడంతో గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీరు ఈ ఏడాది ఒక్కటి కాబోతున్నారు.. దీంతో కొంతమంది లావణ్య త్రిపాఠిని ఇలాంటి వింత సమస్యతో బాధపడుతోందా అంటూ ట్రోల్ చేయగా మరి కొంతమంది భవిష్యత్తులో వరుణ్ కు చాలా కష్టాలు తప్పవు అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news