ఏపీ ఉపాధ్యాయులకు శుభవార్త.. ప్రమోషన్లకు షెడ్యూల్ విడుదల

-

ఏపీ ఉపాధ్యాయులకు శుభవార్త.. ఏపీ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు షెడ్యూల్ విడుదల అయింది. HM గ్రేడ్-2, SA పోస్టుల ప్రమోషన్లకు షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం…  HM పదోన్నతులకు ఈ నెల 30న తొలి సీనియారిటీ జాబితా, జూలై-1,2 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 3న సీనియారిటీ తుది జాబితా, 4న కౌన్సిలింగ్, జులై 5న కొత్త స్కూళ్లలో చేరిక ఉంటుంది.

SAలకు ఈ నెల 30న తొలి సిరియారిటీ జాబితా, జూలై-1, 2, 3 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 4న సీనియారిటీ తుది జాబితా, 5న కౌన్సిలింగ్, జూలై 6న కొత్త స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మూలధన వ్యయం ఎక్కువగా ఉందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. 2014-19 మధ్యకాలంలో సగటున ఏడాదికి రూ.15,227 కోట్ల మూలధనాన్ని ఖర్చు చేశారని…2019-233 మధ్యకాలంలో సగటున రూ.16,095 కోట్లుగా ఉందని తెలిపింది. 2022-23కు మూలధన వ్యయం ఖర్చులపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రూ.5,588 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొనడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news